21న విజయవాడలో 'హాయ్ ల్యాండ్'లో 'ఐస్క్రీమ్-2' ఆడియో
రాంగోపాల్వర్మ 'ఐస్క్రీమ్' సిరీస్లో భాగంగా రూపొందిస్తున్న 'ఐస్ క్రీమ్ 2' ఆడియోను ఈ నెల 21, ఆదివారం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలోని 'హాయ్ ల్యాండ్'లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. భీమవరం టాకీస్ పతాకంపై- అడ్వాన్స్ ఫ్లోకేమ్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జె.డి.చక్రవర్తి, నవీనా, నందు, సిద్ధు, భూపాల్, ధనరాజ్, జీవా, చంటి, శాలిని, గాయత్రి, ప్రభాకర్, బినోజి ముఖ్యపాత్రలు పొషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమవుతున్న నవీనాపై చిత్రీకరించిన 'కిస్ మి ఎవ్రివేర్' సాంగ్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా పోస్ట్ప్రొడక్షన్ జరుపుకొంటున్న ఈ చిత్రం ఈ నెలాఖరుకు విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత తుమ్మపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ... ''కిస్ మి ఎవ్రివేర్' సాంగ్ మరియు థియేట్రికల్ ట్రైలర్తో 'ఐస్క్రీమ్ 2' చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ నెల 21న ఆడియోను విజయవాడలోని 'హాయ్ల్యాండ్'లో విడుదల చేస్తున్నాం. ఈ నెల 14 నుంచి మొదలైన 'ఐస్క్రీమ్ 2' ఆక్షన్కు విశేషమైన స్పందన వస్తోంది.
కొత్తగా పాల్గొనదలచినవాళ్లు తాము తెలిపిన వెబ్ సైటును సందర్శించవచ్చు. యావత్ సినిమా ప్రపంచం గర్వించదగ్గ గొప్ప దర్శకుడు రాంగోపాల్వర్మగారితో వరుసగా చిత్రాలు నిర్మించే అవకాశం దక్కించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను' అన్నారు.