శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 అక్టోబరు 2014 (13:13 IST)

39 రోజుల్లోనే.. తమిళ దృశ్యం పాపనాశం షూటింగ్: కమల్ హాసన్‌..

తెలుగులో వెంకటేశ్ హీరోగా నటించిన 'దృశ్యం' చిత్రాన్ని తమిళంలో కమల్ హాసన్ హీరోగా 'పాపనాశం' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ను కేవలం 39 రోజుల్లోనే పూర్తి చేసినట్లు సమాచారం. కమల్ సహకారంతోనే త్వరగా షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేయగలిగామని సినీ యూనిట్ తెలిపింది. 
 
ఇకపోతే.. నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో రూపొందిన 'ఉత్తమ విలన్' షూటింగ్‌ను కూడా కమల్ ఇటీవలే పూర్తి చేశారని తెలిసింది. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు తెలిసింది. 
 
అలాగే 'విశ్వరూపం 2' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకోవడంతో, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో కమల్ చిత్రాలు మూడు ఉన్నట్టు అవుతోంది. 'విశ్వరూపం 2' చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో.. 'పాపనాశం', 'ఉత్తమవిలన్' చిత్రాలను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని కమల్ భావిస్తున్నట్లు సమాచారం.