సూపర్ సింగర్ విజేతలకు బహుమతులు అందించిన హీరో సచిన్, నజియా
సచిన్, నజియా జంటగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై జయరవీంద్ర దర్శకత్వంలో అగ్ర నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న మ్యూజికల్ లవ్స్టోరీ 'నీ జతగా నేనుండాలి'. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు శ్రోతల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. రెడ్ ఎఫ్.ఎం. 'నీజతగా నేనుండాలి' సూపర్ సింగర్ పాటల పోటీ హైదరాబాద్లోని మంజీరా మాల్లో నిర్వహించింది. సూపర్సింగర్గా మొదటి బహుమతిని భరద్వాజ్, రెండవ బహుమతిని ఫ్రాంక్, మూడో బహమతిని శీతల్ గెలుచుకున్నారు. విజేతలకు హీరో సచిన్, హీరోయిన్ నజియాల చేతులమీదుగా బహుమతులు అందించారు.
ఈ సందర్భంగా హీరో సచిన్ మాట్లాడుతూ - ''ఇలా ప్రేక్షకుల మధ్య రెడ్ ఎఫ్.ఎం. పాటల పోటీ నిర్వహించడం ఆనందంగా వుంది. గెలుపొందిన విజేతలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రంలోని పాటల్ని చాలా పెద్ద హిట్ చేశారు. సినిమాని కూడా పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను'' అన్నారు.
హీరోయిన్ నజియా మాట్లాడుతూ - ''తెలుగులో నేను నటిస్తున్న తొలి సినిమా ఇది. నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమా ద్వారా మీ అందర్నీ కలుసుకోవడం చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రంలోని పాటల్ని అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చాలా బాగుంటుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది'' అన్నారు.
మంజీరా మాల్ మేనేజర్ సంజయ్ మాట్లాడుతూ - ''మా మాల్లో రెడ్ ఎం.ఎం.వారు ఈ పాటల పోటీ నిర్వహించడం చాలా హ్యాపీగా వుంది. ఆషికి 2కి రీమేక్గా వస్తోన్న 'నీజతగా నేనుండాలి' ఆషికి 2 కంటే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటులు సామ్రాట్, విశ్వ తదితరులు పాల్గొన్నారు.