శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2014 (15:34 IST)

శ్వేతాబసుపై వ్యభిచార కేసు : పారిశ్రామికవేత్త రాజకీయ నాయకుడా?

హైదరాబాదులోని ఓ స్టార్ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడిన సినీ హీరోయిన్ శ్వతాబసు ప్రసాద్‌ను పోలీసులు సోమవారం ఎర్రమంజిల్ కోర్టులో హాజరు పరిచారు. నగరంలోని ఓ స్టార్ హోటల్ లో వ్యభిచారం చేస్తూ శ్వేతాబసు ప్రసాద్ ఆదివారం పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. మధ్యవర్తిగా ఉన్న బాలు అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి ప్రశ్నించి పలు వివరాలను రాబట్టారు. 
 
స్టార్ హోటల్‌పై దాడి చేసినప్పుడు శ్వేతతోపాటు పేరుమోసిన పారిశ్రామికవేత్త పట్టుబడ్డారు. కానీ ఆ పారిశ్రామికవేత్త ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవడంతో అతడి పేరు బయటకు పొక్కలేదు. అయితే ఆ పారిశ్రామికవేత్త రాజకీయ నేతని సమాచారం.
 
కాగా అదుపులోకి తీసుకున్న సినీనటి శ్వేతను పునరావాస కేంద్రానికి తరలించారు. ‘కొత్త బంగారు లోకం' చిత్రం ద్వారా కెరీర్ ప్రారంభించిన శ్వేతా బసు అవకాశాలు మందగించడంతో వ్యభిచారం చేస్తూ పక్కదోవ పట్టింది.