'కొత్తబంగారులోకం' దొరికిపోయింది... శ్వేత బసుతో ఆ పారిశ్రామికవేత్త...
కొత్తబంగారు లోకం అంటూ తెలుగు వెండితెరపైకి దూసుకు వచ్చిన ప్రముఖ సినీ కథానాయిక శ్వేత బసు ప్రసాద్ ఆదివారం నాడు హైదరాబాద్లోని ఒక స్టార్ హోటల్లో వ్యభిచరిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన సంగతి తెలిసిన విషయమే. ఐతే నటి శ్వేత బసు ప్రసాద్ ఒక బడా పారిశ్రామికవేత్తతో వ్యభిచరిస్తూ వుండగా పోలీసులు పట్టుకున్నారనే వార్తలు తిరుగుతున్నాయి. కాగా సోమవారం నాడు పోలీసులు శ్వేత బసు ప్రసాద్తో పాటు ఆమెకు మధ్యవర్తిగా వ్యవహరించిన బాలు అనే వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టారు.
కొత్తబంగారు లోకం అంటూ సినిమా రంగంలోకి ప్రవేశించడం కొత్తగా వచ్చే హీరోయిన్లకు పరిపాటి. కానీ ఇక్కడ ఎంత హిట్ వున్నా.... బ్యాక్గ్రౌండ్లేకపోతే అంతేసంగతులు. సరదాగా కబుర్లు చెప్పే మేనేజర్లు, నిర్మాతలు, దర్శకులు ఎవరైతేనేమీ.. అందరూ ఇక్కడ అమ్మాయిల్ని స్వంతానికి ఉపయోగించుకుంటారు. అందుకు ఉదాహరణ పలు హీరోయిన్ల ఉదంతాలున్నాయి. అవకాశాలు లేనప్పుడు పలురకాలుగా ఒత్తిడులకు గురిచేస్తుంటారు.
టీవీ నటీమణులు ఇటీవల వ్యభిచారంలో దొరికిన సందర్భాలున్నాయి. ఇప్పుడు నటి శ్వేతాబసు ఆ కోవలోకి చేరింది. ఈమె ఆదివారం రాత్రి మాదాపూర్ లోని స్టార్ హోటల్లో రెడ్హ్యాండెడ్గా దొరికిపోయింది. పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు.
ఓ గదిలో రాజకీయవేత్త- పారిశ్రామికవేత్త, శ్వేతాబసు దొరకడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇది రేటింగ్ కోసం ఓ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్గా ఫిలింనగర్లో కథనాలు విన్పిస్తున్నాయి. హీరోయిన్లు తస్మాత్ జాగ్రత్త!