అనుష్క కుమార్తెగా నిత్యా మీనన్... స్నేహితురాలిగా కేథరిన్ థ్రెసా..!
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ స్వీయదర్శకత్వంలో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న భారతదేశపు తొలి హిస్టారిక్ త్రీడీ మూవీ 'రుద్రమదేవి' విడుదలకు సిద్ధమైంది. టాలీవుడ్లో టాప్ స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా ఆడియోను మార్చి 21, 22 తేదిలలో రెండు తెలుగు రాష్ట్రాల్లోను విడుదలచేయనున్నారు.
ఈ చిత్రం లీడ్ రోల్ను అందాల తార అనుష్క పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర విశేషాలు రోజు కొకటి వెలువడుతున్నాయి. ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ నిత్యామీనన్ అనుష్కకు కూతురుగా నటిస్తుందట. రుద్రమదేవి (అనుష్క), చాళుక్య వీరభద్ర (రానా) దంపతుల కూతురు ముమ్మిడమ్మగా ఈ సినిమాలో నిత్యా మీనన్ నటించినట్టు తాజా సమాచారం.
అలాగే, రుద్రమదేవి స్నేహితురాలు అనామిక పాత్రను కేథరిన్ థ్రెసా పోషించింది. ఈ అనామిక పోరాట యోధుడు గోన గన్నారెడ్డి (అల్లు అర్జున్) ప్రేమలో పడుతుందట. ఇటీవల విడుదల చేసిన ఈ పాత్రలకు సంబంధించిన స్టిల్స్ అమితంగా ఆకట్టుకుంటున్నాయి.