శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (12:20 IST)

బాహుబలి: వెయ్యి గుర్రాలతో అదుర్స్ షూటింగ్!!

ఎస్.ఎస్. రాజమౌళి మేకింగ్ ఫిలిమ్ ''బాహుబలి'' కోసం వెయ్యి గుర్రాలు సిద్ధమవుతున్నాయి. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాహుబలి కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటే.. ఓ అద్భుత యుద్ధ సన్నివేశం కోసం రాజమౌళి వెయ్యి గుర్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. 
 
బాహుబలిని అద్భుతంగా తెరకెక్కించేందుకు ఎక్కడా రాజీ పడని రాజమౌళి ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరించడంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో యుద్ధ సన్నివేశం చిత్రీకరణ కోసం రాజమౌళి రాజస్థాన్ నుంచి వెయ్యి గుర్రాలను కొన్నాడు.
 
ప్రస్తుతం బాహుబలి సినిమా షూటింగ్ రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో వెయ్యి గుర్రాలతో కూడిన యుద్ధ సన్నివేశాన్ని సోమవారం (22.12.14) నుంచి షూట్ చేస్తారని తెలిసింది. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా, బాహుబలి ఫస్ట్ పార్ట్‌ను 2015 ఏప్రిల్ 17వ తేదీన రిలీజ్ చేసేందుకు రాజమౌళి ముహూర్తం ఖరారు చేసారు.