బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 24 జనవరి 2015 (15:44 IST)

టాలీవుడ్ కు ఏమిటీ షాక్‌లు... మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందా...?

గత రెండేళ్లుగా భారతదేశ చలనచిత్ర పరిశ్రమను చూసినప్పుడు ప్రత్యేకించి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన నటులు ఒకరి తర్వాత ఒకరు కన్నుమూస్తున్నారు. కారణం ఏదైనప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనన్న భయం రాజ్యమేలుతోంది. నటుడు శ్రీహరి, ఉదయ్ కిరణ్, ఏవీఎస్, ధర్మవరపు, అక్కినేని నాగేశ్వర రావు, బాపు, గణేష్ పాత్రో, పీజె శర్మ, నందమూరి జానకీ రామ్, ఆహుతి ప్రసాద్, వీబీ రాజేంద్రప్రసాద్, ఎమ్మెస్ నారాయణ.. ఇలా వరుసగా సినీ ప్రముఖులు రాలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. 

 
మరోవైపు మరో ఇద్దరు సినీ ప్రముఖుల ఆరోగ్యం ఎంతమాత్రం బావుండలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. వారి ఆరోగ్యంపై వారి కుటుంబ సభ్యులు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మొత్తానికి నటుడు మురళీ మోహన్ అన్నట్లుగా ఇండస్ట్రీకి ఏదైనా ఆవహించిందో... లేదంటే ఏదైనా దోషం వచ్చిందో చెక్ చేయించుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది.