గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 26 ఆగస్టు 2014 (17:17 IST)

త్రిషకు ఆఫర్లు లేవే.. మరి ఎందుకు కోటి పాతిక..?

త్రిషకు చెప్పుకోదగిన ఆఫర్లు లేకపోయినా... ఆమె తన పారితోషికం విషయంలో మాత్రం ఏమాత్రం రాజీపడట్లేదని సమాచారం. బాలకృష్ణతో చేస్తున్న గాడ్సే చిత్రం కోసం ఆమెకు ఇచ్చిన ఎమౌంటే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 
 
త్రిషకు గాడ్సే కోసం కోటి పాతిక లక్షలు వరకూ పే చేసారని తెలుస్తోంది. మొదట నిర్మాతలు అంత పే చేయటానికి ముందుకు రాలేదని అయితే బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగి వారిని ఒప్పించి, ఆమెను తన సినిమాలోకి తీసుకున్నారని వినిపిస్తోంది.
 
అలాగే ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా ...'లెజెండ్‌'లో బాలకృష్ణతో ఆడిపాడి ప్రేక్షకులను అలరించిన రాధికా ఆప్టేని తీసుకున్నారు. అందులో పెద్ద బాలకృష్ణ మేనకోడలుగా ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు ఆమె మరోసారి బాలకృష్ణతో నటిస్తోంది. బాలకృష్ణ తాజా చిత్రంలో ఓ హీరోయిన్‌‍గా రాధికా ఆప్టేను ఎంపిక చేశారు.