అబ్బా నాకు నిశ్చితార్థం జరగలేదండీ బాబూ.. వరుణ్ ఫ్రెండ్ మాత్రమే!
అబ్బా.. నాకు నిశ్చితార్థం జరగలేదండీ బాబూ.. పారిశ్రామికవేత్త వరుణ్ మనియణ్ నాకు ఫ్రెండ్ మాత్రమే అంటోంది చెన్నై సుందరి త్రిష. త్రిషకు వివాహ నిశ్చితార్థం జరిగిపోయిందంటూ కోలీవుడ్లో జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
పారిశ్రామికవేత్త వరుణ్ మనియణ్తో ఆమె వివాహం జరుగుతుందని అంటున్నారు. అయితే, ఇప్పటికే ఆ వార్తలను ఖండించిన త్రిష ఇప్పుడు తాజాగా మరింత క్లారిటీ ఇచ్చింది. మొన్న ఖండన రోజున వరుణ్ ప్రస్తావనే ఎత్తని ఈ చిన్నది ఈసారి అతని పేరు ప్రస్తావించడం విశేషం.
"ఈ విషయం కేవలం వరుణ్కి, నాకు మాత్రమే సంబంధించింది కాదు. మా ఇరు కుటుంబాల వారికీ చెందినది. కాబట్టి, దీనిపై నేను ఎక్కువగా మాట్లాడితే బాగుండదు. అయినా, వరుణ్ నాకు మంచి ఫ్రెండు.
జస్ట్ అతనితో కల్సి ఫోటో దిగినంత మాత్రాన ఎంగేజ్ మెంట్ జరిగిపోయినట్టేనా?" అంటూ ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం తన సినిమాలు కొన్ని సెట్స్పై వుండడం వల్లే ఈ విషయాన్ని ఆమె దాచిపెడుతోందని అంటున్నారు