శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (15:36 IST)

జయం రవితో సినిమా.. మధ్యలో త్రిష.. అంజలి బాధ!

జయం రవి హీరోగా రూపొందుతున్న సినిమాలో అంజలి కథానాయికగా నటిస్తోంది. కొంత గ్యాప్ తర్వాత అంజలి నటిస్తున్న ఈ సినిమాపై సీతమ్మ అంచనాలు పెట్టుకుంది. అయితే అంజలి అంచనాలకు త్రిష గండికొట్టనుందని టాక్ వస్తోంది. అంతే అంజలికి భయం పట్టుకుంది. 
 
జయం రవి హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో తానే ప్రధాన కథానాయికనని అంజలి భావించింది. అయితే, ఆ తర్వాత ఆ సినిమాలో త్రిష కూడా కథానాయికగా జాయిన్ అయింది. దాంతో అంజలికి బాధ పట్టుకుంది. త్రిష ఉండడంతో తన పాత్ర పలుచనైపోతుందని ఆమె తెగ ఫీలవుతోందట.
 
దానికి తోడు ఇప్పుడు ఇందులో ఓ ఐటెం సాంగు కోసం పూర్ణను కూడా తీసుకున్నారు. దీంతో అంజలికి మరింత టెన్షన్ పట్టుకుంది. గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ సినిమా కోలీవుడ్‌లో తనకు మంచి బ్రేక్ అవుతుందని అనుకుంటుంటే, ఓ పక్క త్రిష ... మరోపక్క పూర్ణ ఐటెం సాంగుతో తన పాత్రకు ఇక ప్రాధాన్యత ఏం ఉంటుందని అమ్మడు తెగ ఫీలవుతోందట.