పూరీ సన్ ఆకాష్ సరసన ఉల్కా గుప్తా!
పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ సరసన లీడ్ రోల్ పోషించేందుకు 'ఝాన్సీ కీ రాణి' టీవీ సీరియల్లో బాల ఝాన్సీగా నటించిన ఉల్కా గుప్తా రెడీ అవుతోంది.
ఆ మధ్య 'రిషి' చిత్రాన్ని రూపొందించి, నంది అవార్డు కూడా అందుకున్న రాజ్ మాదిరాజు దర్శకత్వంలో రమేష్ ప్రసాద్ నిర్మించే సినిమాలో ఆకాష్ మేల్ లీడ్గా నటిస్తున్నాడు.
టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఉల్కాను కథానాయికగా ఎంపిక చేసినట్టు సమాచారం. మరాఠీలో వచ్చిన 'టైం పాస్' అనే సినిమా ఆధారంగా దీనిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.