భారీస్థాయిలో 'ఐ' పాటల వేడుక: రూ.7కోట్లతో ఫంక్షన్!
సెన్సేషనల్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఆస్కార్ ఫిలింస్ పతాకంపై ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘ఐ’ (మనోహరుడు). ఇండియాలోనే భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా ఆడియో వేడుక ఈనెల 15న చెన్నయ్లో జరగనుంది.
ఈ చిత్రాన్ని తెలుగులో ‘మనోహరుడు’ పేరుతో మెగా సూపర్గుడ్ ఫిలింస్ అందిస్తోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాలీవుడ్ సూపర్ హీరో ఆర్నాల్డ్ ష్వాష్నెగ్గర్, తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని, చెన్నయ్లోని నెహ్రూ స్టేడియంలో భారీగా జరగనుందని నిర్మాత రవిచంద్రన్ తెలిపారు.
ఎ.ఆర్.రెహమాన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన హైలెట్ అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20వేల థియేటర్లలో పలు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇప్పటివరకు జరగనటువంటి సంచలనం ఈ చిత్రంతో జరగనుండడం విశేషం. ఈ చిత్రంలో విక్రమ్ సరసన అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా ఆడియోకు రూ.7 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది.