శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 4 మార్చి 2015 (14:18 IST)

నిత్యామీనన్ రేంజ్ పెరిగిపోయిందా..? మణి సినిమాతో రూ.2 కోట్లకు..?

నిత్యామీనన్ రేంజ్ పెరిగిపోయింది. ఎందుకో తెలుసా? మణిరత్నం సినిమాలో ఛాన్స్ వచ్చే సరికి నిత్యామీనన్ అమాంతంగా రేటు పెంచేసింది. మణిరత్నం దర్శకత్వంలో ఓకే కణ్మణి (తెలుగులో ఒక బంగారం)లో నటిస్తున్న నిత్యామీనన్.. తాజాగా తన పారితోషికాన్ని ఏకంగా రూ.2 కోట్లకు పెంచేసిందని టాక్ వస్తోంది. 
 
తాజాగా హిట్ సినిమాలతో దూసుకుపోతున్న నిత్యామీనన్... స్టార్ హీరో, స్టార్ డైరక్టర్ అయినా ఏమాత్రం పట్టించుకోదు. ఆమెకు నచ్చిన పాత్ర లభిస్తే పారితోషికం విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోని నిత్య ఈ మధ్య ఓ నిర్మాతకు భారీ షాక్ ఇచ్చిందట. బాలీవుడ్‌‌లో హిట్ అయిన 'క్వీన్' సినిమాను దక్షిణాది భాషల్లోకి అనువదించాలని నిర్మాత త్యాగరాజన్ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారట. 
 
ఈ సినిమాలో కంగనా రనౌత్ చేసిన పాత్రకు సమంత, నయన్, అనుష్క తదితరుల పేర్లను పరిశీలించిన తర్వాత చివరకు నిత్యామీనన్‌ను సంప్రదించారట. ఏమాత్రం లేట్ చేయని నిత్య సినిమాకు ఓకే చెప్పిందట. అయితే రూ. 2 కోట్ల పారితోషికం కావాలని కోరిందట. దీంతో, త్యాగరాజన్ బిత్తరపోయారట. నిత్యకు రెండు కోట్లు ఇచ్చే బదులు మరో స్టార్ హీరోయిన్‌ను పెట్టుకుంటే, సినిమాకు పబ్లిసిటీ కూడా వస్తుందనే ఆలోచనలో పడ్డారట. 
 
మరి నిత్యామీనన్ పారితోషికాన్ని పెంచేయడానికి మణి ఫిలిమ్ కారణమని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి త్యాగరాజన్ ఆ ఛాన్స్ నిత్యామీనన్‌కు ఇస్తాడో.. స్టార్ హీరోయిన్‌ను సెలక్ట్ చేసుకుంటాడో తెలియాలంటే.. వెయిట్ చేయాల్సిందే.