చిత్రం, నువ్వు-నేను, జయం వంటి సూపర్ హిట్ సినిమాలకు పాటలు రాసిన ప్రముఖ సినీగేయ రచయిత కులశేఖర్ ఇటీవల ఓ దొంగతనం కేసులో పట్టుబడి జైలుపాలయిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు మతిస్థిమితం సరిగా లేకపోవడంవల్లే ఈ దొంగతనం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నా ఎవరూ అండగా లేని పరిస్థితి వచ్చింది.ఇటీవల కులశేఖర్ అక్టోబరు 24న కాకినాడలోని ఓ గుడికి వెళ్లి.. అక్కడ దర్శనానంతరం దేవుడి శఠగోపం ఎత్తుకొచ్చారనే ఆరోపణలపై కులశేఖర్ని అరెస్ట్ చేశారు.