చిత్ర నిర్మాణంలో రూ.వందల కోట్లు నష్టపోతున్న పీవీపీ.. అయినా వెనక్కి తగ్గరట!
ఈ మధ్య కాలంలో పివిపి నిర్మాణ సంస్థ పేరు ఓ రేంజ్లో మార్మోగిపోతోంది. తరతరాలుగా సినిమాలు తీస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడ పివిపి ధాటికి తట్టుకోలేక పోతున్నాయి. కానీ ఇప్పటివరకు పివిపి సంస్థ తీసిన సినిమాల వల్ల రూ.100 కోట్లు నష్టపోయారంటే నమ్ముతారా... 2011లో ఒక తమిళ సినిమా తీయడం ద్వారా సినిమా రంగంలోకి పీవీపీ సంస్థ ఎంట్రీ ఇచ్చింది.
తమిళంలో మొదటి చిత్రం ''రాజపాట్టై'' (వీడింతే) తర్వాత చాలా చిత్రాలు మంచి సక్సెస్ని అందుకున్నాయి. ఆ తర్వాత అనుష్క - ఆర్య నటించిన ''వర్ణ'', ''సైజ్ జీరో'' వంటి రెంత్రాడు చిలతో పరాజయాన్ని ఎదుర్కొన్నారు. తెలుగులో మాస్ మహరాజా రవితేజతో నిర్మించిన ''బలుపు'' చిత్రం ఓ మోస్తారుగా యావరేజ్ టాక్ని సంపాదించుకుంది.
కాగా, ఈ యేడాది ఇదే సంస్థ నిర్మించిన ''ఊపిరి'' సినిమాకు మంచి టాక్ వచ్చినా కూడా ఈ సినిమాపై ఖర్చు భారీగా పెట్టింది. దీంతో దాదాపు రూ.20 కోట్ల నష్టాన్ని చవిచూసినట్టు సమాచారం. అయితే ఇన్ని భారీ సినిమాల మధ్య పివిపి నిర్మించిన చిత్రాల్లో ''క్షణం'' మాత్రమే సక్సస్ సాధించింది.
భారీ అంచనాలతో విడుదలైన ''బ్రహ్మోత్సవం'' కూడా డిజాస్టర్గా మిగిలింది. దీని ప్రకారం పివిపి సంస్థ రూ.100 కోట్లు నష్టపోయింది. కానీ ఈ వంద కోట్లు నష్టం పివిపి సంస్థని ఏ మాత్రం తగ్గించలేదట. దీనికి కారణం ఈ సంస్థకు వివిధ వ్యాపారాలలో ఉన్న వందలాది కోట్ల రూపాయల పెట్టుబడులే.