గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (14:50 IST)

'బ్రహ్మోత్సవం' నైజాం రైట్స్... రూ.16 కోట్లు... దిల్ రాజుకు మొండిచేయి!

ప్రిన్స్ మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది. 'శ్రీమంతుడు' తర్వాత విడుదలవుతున్న చిత్రం కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. మిక్కి జె.మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ఆడియోను మే 7న హైదరాబాద్‌లో జరిపేందుకు దర్శకనిర్మాతలు నిశ్చయించారు. 
 
అలాగే ఈ సినిమాను మే 20న విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నట్టు సమాచారం. దీంతో చిత్రానికి నైజాంలో తీవ్రంగా పోటీ ఏర్పడింది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు సైతం నైజాం హక్కుల కోసం పోటీపడినప్పటికి అభిషేక్ పిక్చర్స్ రూ.16 కోట్లకు దక్కించుకుంది. ఇంతకుముందు మహేష్ నటించిన 'శ్రీమంతుడు' చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ ప్రతినిధులే నైజాంలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దిల్ రాజు రూ.14 కోట్లకు పైగా చెల్లించడానికి ముందుకు వచ్చినప్పటికీ దానికంటే ఎక్కువగా చెల్లించి అభిషేక్ పిక్చర్స్ సొంతం చేసుకున్నట్లు అభిషేక్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రతినిధి స్వయంగా తెలిపారు.