మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 28 మే 2017 (16:34 IST)

టీవీల్లో బూతు ప్రోగ్రాముల్ని ప్రసారం చేస్తున్నారు : సినీ న‌టి క‌విత

టీవీల్లో వస్తున్న ప్రోగ్రాములపై సినీ నటి కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 'జబ‌ర్దస్త్' కామెడీ ప్రోగ్రాంలోనే కాకుండా తెలుగు సినిమాల్లోనూ ప‌లు డైలాగులు చిన్న‌పిల్ల‌లు, ఆడ‌వారు కూర్చొని విన‌డానికి వీలుల

టీవీల్లో వస్తున్న ప్రోగ్రాములపై సినీ నటి కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 'జబ‌ర్దస్త్' కామెడీ ప్రోగ్రాంలోనే కాకుండా తెలుగు సినిమాల్లోనూ ప‌లు డైలాగులు చిన్న‌పిల్ల‌లు, ఆడ‌వారు కూర్చొని విన‌డానికి వీలులేని విధంగా ఉంటున్నాయని అన్నారు. 
 
ఇదే అంశంపై ఆమె ఆదివారం మాట్లాడుతూ... తాము ఒక రోజు ఒక ఆడియో ఫంక్ష‌న్‌కి వెళ్లామ‌ని, 'జ‌బ‌ర్ద‌స్త్' వారు వేదిక‌పై కామెడీ ప్రోగ్రాం వేశారని ఆమె చెప్పారు. వారు చెప్పే డైలాగుల‌కి ఎంతో మంది విజిల్స్ వేస్తున్నారని చెప్పారు. జ‌బ‌ర్ద‌స్త్‌లో ఇటువంటి బూతు డైలాగులు వేస్తార‌ని త‌న‌కు అప్పుడే తెలిసింద‌ని అన్నారు.
 
అక్క‌డ‌ వెయ్యిమంది ఉంటే 998 మంది ఎంజాయ్ చేస్తున్నారని, కేవ‌లం ఇద్ద‌రు ముగ్గురు మాత్ర‌మే ఇబ్బంది ప‌డ్డారని ఆమె గుర్తు చేశారు. అనంత‌రం తాను ఓ జ‌బ‌ర్ద‌స్త్ న‌టుడితో ఇటువంటి ప్రోగ్రాం ఎందుకు వేస్తార‌ని అడిగితే... 'చూసేవారు హ్యాపీగానే చూస్తున్నారు.. ప్రసారం చేసేవారు హ్యాపీగానే చేస్తున్నారు' అని సమాధానం చెప్పారని క‌విత అన్నారు.