అతనికి అభిమానిగా మారిన ఝాన్సీ.. తదుపరి చిత్రానికి కర్చీఫ్ వేసిందట...
యాంకర్గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఝాన్సీ.. నటిగా కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. వైవాహిక జీవితలో జోగ్రి బ్రదర్స్ నుంచి విడిపోయిన ఆమె ప్రస్తుతం డబ్బింగ్ స్టూడియోను నిర్వహిస్తుం
యాంకర్గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఝాన్సీ.. నటిగా కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. వైవాహిక జీవితలో జోగ్రి బ్రదర్స్ నుంచి విడిపోయిన ఆమె ప్రస్తుతం డబ్బింగ్ స్టూడియోను నిర్వహిస్తుంది. అందంగా, ఆకర్షణీయంగా ఉండే ఝాన్సీ.. ఈమధ్య కొంతకాలం ఎక్కడా కన్పించలేదు.
కాగా, ఇటీవలే 'జయమ్ము నిశ్చయమ్మరా' సినిమా ప్రయోషన్లో ఆమె పాల్గొంది. ఈ చిత్రంలో జోగి బ్రదర్స్ కూడా నటించారు. ఇటీవలే ఈ చిత్రం విజయోత్సవ సందర్భంగా ప్రసాద్ల్యాబ్లో జరిగిన కార్యక్రమంలో ఆమె యాంకర్గా వ్యవహరించింది. ఆమె చాలా తగ్గడం చూసి.. అందరూ ఆశ్చర్యపోయారు.
ఇకపోతే ఈ సందర్భగా ఆ చిత్ర దర్శకుడ్ని ఆకాశానికి ఎత్తేసింది. స్పందన ''ఓ రంగుల చిలుక'' గీతాలాపనతో మొదలైన ఈ వేడుక.. వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఝాన్సీ ఛలోక్తులతో, చతురోక్తులతో ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది. ఈ చిత్రం తనను ఎంతగానో కదిలించిందనీ, దర్శకుడు శివరాజ్ కనుమూరికి తాను అభిమానిగా మారిపోయానని ఝాన్సీ వ్యాఖ్యానించారు. దీంతో తదుపరి సినిమాకు ఆమె కర్చీఫ్ వేసేసిందన్నమాట.