గోపీచంద్ 'ఆక్సిజన్' మూవీలో అను ఇమ్మాన్యుయేల్
ఒకప్పుడు టాలీవుడ్లోకి బాలీవుడ్ ముద్దుగుమ్మలు వలసలు కట్టేవారు. ఇప్పుడు ఈ వలసలు మలయాళ పరిశ్రమ నుంచి ఎక్కువయ్యాయి. ఇప్పటికే పలువురు భామలు టాలీవుడ్లో హంగామా చేస్తున్నారు. ఇప్పటికే కీర్తి సురేష్, అనుపమా పరమేశ్వరన్లు తమ సత్తాను చాటేస్తున్నారు. లేటెస్ట్గా మరో హీరోయిన్ పరిచయంకానుంది.
అయితే.. మళయాళ ఇండస్ట్రీలో ఓ కొత్త సెంటిమెంట్ ఏర్పడింది. నివీన్ పౌలీకి జంటగా అరంగేట్రం చేసిన హీరోయిన్స్ అందరికీ ఇతర భాషల్లో ఆఫర్స్ రావడం గ్యారంటీ అని. నమితా ప్రమోద్, ఇషా తల్వార్లకు ఇలాగే ఇతర ఇండస్ట్రీలలో ఛాన్సులు వచ్చాయి. ఇప్పుడీ లిస్ట్లోకి మరో భామ వచ్చి చేరింది. నివీన్ పౌలీ నెక్ట్స్ ప్రాజెక్ట్తో అను ఇమ్మాన్యుయేల్ అరంగేట్రం చేయనుంది. మళయాలంలో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు కానీ.. ఇప్పుడీ భామకి టాలీవుడ్లో అవకాశాలు వచ్చి పడుతున్నాయి.
అమెరికా నుంచి వచ్చిన అను ఇమ్మాన్యుయేల్... గోపిచంద్ 'ఆక్సిజన్' మూవీతో టాలీవుడ్లోకి అడుగుపెట్టనుంది. ఈ చిత్రం డైరెక్టర్ జ్యోతికృష్ణ మాట్లాడుతూ.... ఈ రోల్కి అను సరిగ్గా ఉందని తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే అను 'ఆక్సిజన్' షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో రాశిఖన్నా మరో లీడ్ హీరోయిన్ కాగా సీనియర్లు జగపతిబాబు, సీనియర్ నటి సితార కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.