శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 11 అక్టోబరు 2015 (12:31 IST)

'మన్మథుడు'తో రొమాన్స్ చేయనున్న 'రుద్రమదేవి'

టాలీవుడ్ 'మన్మథుడు'తో 'రుద్రమదేవి' రొమాన్స్ చేయనుంది. హీరో నాగార్జున, తమిళ హీరో కార్తీలు కలిసి వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నాగార్జున సరసన అనుష్క నటించనున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.
 
 
నిజానికి గత కొన్నేళ్లుగా ఈ జంట వెండితెరపై కనిపించలేదు. దీనికి కారణం లేకపోలేదు. కొంత కాలంగా ఎవరి సినిమాల్లో వారు బిజిగా ఉన్నారు. ప్రస్తుతం అనుష్క ఇంకా బిజీగా సినిమాలు చేస్తోంది. ఒకదాని తర్వాత ఒకటి ఆమె కోసం ఎదురు చూస్తున్నాయి. నాగార్జున కూడా వయసు మీదపడుతున్న సమయంలో స్పీడ్ పెంచి వరుస సినిమాలు చేసేస్తున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో తన సరసన నటించాలని అనుష్కను నాగార్జున కోరగానే ఆమె సమ్మతించారు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ చిత్రం అంటచ్‌బుల్ అనే చిత్రం ప్రేరణతో నిర్మిస్తున్నారు. ఇందులో నాగ్‌కు మాజీ గర్ల్‌ఫ్రెండ్ రోల్ చేయడానికి అనుష్క ఒప్పుకుందట. ఇందులో అనుష్క స్టోరీ పాత్ర కూడా డిఫరెంట్‌గా ఉంటుందని ఫిల్మ్ వర్గాల టాక్. ఈ చిత్రంలో నాగార్జున వీల్‌చైర్‌లో కనిపిస్తున్న విషయం తెల్సిందే.