టాలీవుడ్లో అనుష్క కథ ముగిసింది.. అందుకే కోలీవుడ్పై దృష్టిపెట్టిందా?
ఒకప్పుడు టాలీవుడ్ ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ అనుష్క. అగ్రహీరోలందరి సరసన నటించింది. ప్రస్తుతం లేడీ ఓరియంటెండ్ కథా పాత్రలు ఉన్న 'బాహుబలి', 'రుద్రమదేవి' చిత్రాల్లో నటిస్తోంది. ఈ చిత్రాల షూటింగ్ కోసమే ఆమె నెలల తరబడి పని చేస్తూ బిజీగా గడుపుతోంది. పైగా.. పలువురు నిర్మాతలు ఆమెను సంప్రదించినా కొత్త సినిమాలు అంగీకరించేందుకు సమ్మతించడం లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది.
తెలుగులో కొత్త సంతకాలు పెట్టకపోవడానికి ప్రధాన కారణం, సీనియర్ హీరోల నుంచి అమ్మడికి ఆఫర్లు లేవు. యంగ్ హీరోలు ఆమెతో చేయడానికి ఒప్పుకోవడం లేదు. ఎవరో ఒకరిద్దరు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి మాత్రమే ఆమెను సంప్రదిస్తున్నారు. అందుకే, తనకు అవకాశాలు వస్తున్న తమిళ రంగంపైనే దృష్టి పెడుతోందట. ఒక విధంగా చెప్పాలంటే, కొత్త హీరోయిన్ల ఆగమనంతో, అనుష్క కెరీర్ ఇక తెలుగులో ముగిసినట్టుగానే భావిస్తున్నారు.
మరోవైపు.. తమిళంలో రజనీకాంత్, అజిత్ సినిమాలలో నటిస్తోంది. మరి కొన్ని తమిళ సినిమాలు కూడా చర్చల దశలో వున్నాయి. తెలుగులో అంగీకరించకుండా, ఒక్క తమిళంలోనే ఆమె అంగీకరించడానికి కారణాలేంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. టాలీవుడ్లో ఓ వెలుగు వెలుగుతూ వచ్చిన అందాల అనుష్క తెలుగులో కొత్తగా సినిమాలు అంగీకరించకపోవడం వెనుక కథేంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.