గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 10 అక్టోబరు 2017 (16:54 IST)

'అర్జున్ రెడ్డి' దర్శకుడికి పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చెస్తోందా?

ఒకే ఒక్క హిట్. అర్జున్ రెడ్డి చిత్రంతో పాపులర్ డైరెక్టర్ అయిపోయిన సందీప్ వంగా కోసం ఇప్పుడు నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఎవరెట్లా వున్నా ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీస్ సందీప్ వంగా చేతిలో రూ. 50 లక్షలు అడ్వాన్స్ పెట్టేసిందట. మంచి కథ తీస

ఒకే ఒక్క హిట్. అర్జున్ రెడ్డి చిత్రంతో పాపులర్ డైరెక్టర్ అయిపోయిన సందీప్ వంగా కోసం ఇప్పుడు నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఎవరెట్లా వున్నా ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీస్ సందీప్ వంగా చేతిలో రూ. 50 లక్షలు అడ్వాన్స్ పెట్టేసిందట. మంచి కథ తీసుకుని వస్తే హీరోను కూడా తామే సెట్ చేస్తామని చెప్పారట. ఐతే స్పెషల్ ఏంటని అనుకోవచ్చు.
 
మైత్రీ మూవీస్ బ్యానర్ చేతిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నితిన్ కాల్షీట్లు వున్నాయి. కాబట్టి సందీప్ వంగా పవర్ ఫుల్ స్టోరీ తీసుకువస్తే పై ముగ్గురిలో ఎవరో ఒక హీరోను డైరెక్ట్ చేసే అవకాశం ఖాయం. మొత్తమ్మీద అర్జున్ రెడ్డి చిత్రంతో ఆ చిత్రంలో నటించిన హీరోకే కాదు దర్శకుడికి కూడా బాగా కలిసొచ్చిందన్నమాట.