హైదరాబాద్లో అల్యూమినియం ఫ్యాక్టరీలో 'బాహుబలి' షూటింగ్
నెలరోజుల వేసవి సెలవుల అనంతరం 'బాహుబలి' టీం ఇటీవలే షూటింగ్ ప్రారంభించింది. ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా నటిస్తున్నారు. ప్రస్రుతం షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతుంది. హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో 'బాహుబలి' షూటింగ్ కోసం సెట్ని సిద్ధం చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ చాన్నాళ్ల నుంచి వాడుకలో లేకపోవడం, అంతేకాకుండా ఫ్యాక్టరీ చుట్టూ దట్టమైన అడవి కూడా ఉండడంతో 'బాహుబలి' షూటింగ్కి అనువుగా ఉందని.. ఇక్కడ షూటింగ్కి దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేశాడు.
ఆర్ట్ డైరెక్టర్ శాబు సిరిల్ ఈ సెట్ పనులలో నిమగ్నమైయున్నాడు. ఈ సెట్ కోసం చాలా మంది కష్టపడ్డారట. ఈ చిత్ర షూటింగ్ జూన్లో ప్రారంభం కాబోతుంది. ఈ 'బాహుబలి' లొకేషన్స్ ఏరియాలో చాలా సెక్యురిటీని పెట్టి బయటి వారిని లోపలికి రానివ్వడం లేదట. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ రామోజీ ఫిలిం సిటీలో వార్ ట్రయల్స్ని చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్టోబరు నెలాఖరు నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ చిత్రం 2017 ఏప్రిల్లో రిలీజ్ కానుంది.