బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (09:10 IST)

సుజీత్ దర్శకత్వంలో నటించనున్న ప్రభాస్... బాహుబలి తర్వాత...

''బాహుబలి'' సినిమా తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించబోయే సినిమాపై ఓ క్లారిటీ వచ్చేసింది. ''రన్ రాజా రన్'' సినిమాతో చిత్ర పరిశ్రమ ప్రముఖులతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకున్న యువ దర్శకుడు సుజీత్ చెప్

''బాహుబలి'' సినిమా తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించబోయే సినిమాపై ఓ క్లారిటీ వచ్చేసింది. ''రన్ రాజా రన్'' సినిమాతో చిత్ర పరిశ్రమ ప్రముఖులతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకున్న యువ దర్శకుడు సుజీత్ చెప్పిన కథకు ప్రభాస్ ఓకే చెప్పారు. ''మిర్చి'', ''రన్ రాజా రన్'' సినిమాలను నిర్మించిన యువి క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. ప్రమోద్, వంశీలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 
 
దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారట. ఇందులో ప్రభాస్ స్టైలిష్ పోలీసాఫీసర్ పాత్ర చేయనున్నారట. హిందీ నటుడు నీల్ నితిన్ ముఖేష్‌ని విలన్‌గా తీసుకోవాలనుకుంటున్నారట. వచ్చే జనవరిలో చిత్రీకరణ మొదలుపెట్టాలనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన ''బాహుబలి'' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 17న ''బాహుబలి'' విడుదల కానుంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకులలో భారి అంచనాలు నెలకొన్నాయి.