మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (14:23 IST)

''గౌతమీపుత్ర శాతకర్ణి'' చిత్రం కోసం బాలీవుడ్ నటీనటులపై కన్నేసిన బాలయ్య!

బాలకృష్ణ వందో సినిమాపై వెలువడుతున్నవార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. బాలయ్య వందో సినిమా కావడంతో సినీ ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ''గౌతమీపుత్ర శాతకర్ణి'' కథతో తెరకెక్కనున్న ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ తెరకెక్కించనున్న ఈ చారిత్రక సినిమాలో నటీనటులతో పాటు, సాంకేతికంగానూ ఈ సినిమాని వైవిధ్యభరితంగా చూపేందుకు దర్శకుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. 
 
అందులో భాగంగానే బాలీవుడ్ నటి హేమ మాలినిని తల్లి పాత్రకు ఎంపిక చేశాడు. అలాగే దర్శకుడు క్రిష్ బాలకృష్ణలు ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇందుకోసం క్రిష్ ఈ చిత్రంలో నటీనటులను చాలా వరకు బాలీవుడ్ వాళ్ళని తీసుకుంటున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. 
 
బాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్న క్రిష్ ఇప్పుడు బాలయ్యతో చేస్తున్న చిత్రంతో అక్కడ కూడా క్యాష్ చేసుకొనే ఆలోచనలో ఉన్నాడట. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మొదటి షెడ్యుల్‌ని మొరాకోలో నెల రోజుల పాటు చేసేందుకు యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారట.