బోయపాటి సినిమా ఆగిపోయిందా...?!
'లెజెండ్' తర్వాత గ్యాప్ తీసుకున్న దర్శకుడు బోయపాటి శీను.. మహేష్ బాబుకూ కథ చెప్పాడు. కానీ నచ్చకపోవడంతో విరమించుకున్నాడు. ఆ తర్వాత బెల్లంకొండ సురేష్ తన కుమారుడు శ్రీనును హీరోగా చేస్తూ ఓ చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చాడు. అయితే... ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
చిత్ర కథలో హీరో క్యారెక్టర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం కోసం జుట్టు పెంచడం, బాడీ బిల్డప్ చేయడం వంటివి వున్నాయి గనుక కొన్ని నెలలు వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే.. ఇప్పటికే బెల్లంకొండ సురేష్పై అప్పుల వాళ్ళు మీదపడుతున్నారు. కొన్నాళ్ళు అజ్ఞాతంలో వున్న ఆయన మరలా వచ్చాడు.
అయితే ఈసారి నిర్మాతగా.. తన పేరు కాకుండా తన బంధువు అయిన నల్లమలుపు బుజ్జి పేరును తెరపైకి తెచ్చాడు. 'అల్లుడు శీను' చిత్రం తర్వాత బెల్లంకొండ శ్రీను చేయబోయే సినిమాకు నిర్మాత ఆయనే. కానీ వెనుక వుండి కథంతా నడిపించేది సురేషే. ఈ గ్యాప్తో బోయపాటి సినిమా ఆగిపోయిందేమోనని అనుకుంటున్నారు. కానీ తన కొడుకు సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగనీయకుండా చూడాలని సురేష్ ప్రయత్నిస్తున్నారు.