'బ్రహ్మోత్సవం' : టాలీవుడ్లో ఫ్లాప్ టాక్.. శాండిల్వుడ్లో కలెక్షన్ల వర్షం!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో రిలీజైన చిత్రం ''బ్రహ్మోత్సవం''. ఫుల్ అండ్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది. ''శ్రీమంతుడు'' తర్వాత మహేష్ నటించిన సినిమా కావడంతో సినిమాకు రిలీజ్కు ముందు భారీ హైప్ క్రియేట్ చేసింది. కానీ, ఆ అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాని ప్రముఖ వ్యాపారవేత్త పోట్లురి వి ప్రసాద్ పి.వి.పి బ్యానర్పై నిర్మించారు. ''బ్రహ్మోత్సవం'' మూవీ ప్రీమియర్ షో నుండే మిశ్రమ స్పందన రావడంతో అందరి అంచనాలు తల్లకిందులయ్యాయి. టాలీవుడ్లో అందరి హీరోల కంటే మహేష్ బాబుకి ఓవర్ సీస్లో బాగా కలెక్షన్స్ వసూల్ చేసే హీరోగా పేరుంది.
''ఆగడు'' వంటి ఫ్లాప్ మూవీ కూడా ఓవర్ సీస్లో భారీ వసూళ్లను రాబట్టింది. కానీ ''బ్రహ్మోత్సవం'' మూవీ మాత్రం అక్కడ కూడా ఫ్లాప్ టాక్ని సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణాల్లోని అన్ని ప్రాంతాల్లో కలిపి మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా రూ.21.48 కోట్లను వసూళ్లు చేసింది. ఇక ఓవర్సీస్లో కూడా తొలి మూడు రోజులకే మిలియన్ మార్క్ టచ్ చేసింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా ''బ్రహ్మోత్సవం''కు రూ.90 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి బ్రహ్మోత్సవం ప్లాప్ టాక్తో అంత షేర్ వసూలు చేస్తుందా అన్న సందేహాలు చోటుచేసుకుంటున్నాయి. రోజు రోజుకీ ఈ సినిమా కలెక్షన్లు తగ్గిపోతున్నాయి. కాగా ఈ సినిమా రిజల్ట్ని చూసిన ప్రిన్స్ కూడా చాలా నిరుత్సాహం చెందాడట. మరోవైపు.. బ్రహ్మోత్సవం చిత్రానికి కర్ణాటక ప్రేక్షకులు మాత్రం నీరాజనం పడుతున్నారు. ఫలితంగా శాండిల్వుడ్లో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. 'బ్రహ్మోత్సవం' బెంగళూరు బాక్సాఫీస్లో నెంబర్ వన్ ప్లేస్లో దూసుకుపోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.