చిరు 150వ సినిమా ఆటో జానీ...? టాలీవుడ్ టాక్... పవన్ చిత్రం అపుడే...
ఇప్పుడు సినిమా రంగంలో చిరంజీవి 150వ సినిమానా! పవన్ కళ్యాణ్ సినిమానా! ఏది సెట్పైకి వెళ్ళనున్నదనేది చర్చగా మారింది. చిరంజీవి సినిమా కోసం దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనాల్ కాలేదు. కానీ పూరీజగన్నాథ్ దర్శకుడు అనే విషయం బాగా ప్రచారంలో వుంది. ప్రస్తుతం పూరీ చార్మితో 'జ్యోతిలక్ష్మి' అనే చిత్రం రూపొందించడానికి ఉగాదికి ముహూర్తం పెట్టారు. దీన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. కానీ.. చిరంజీవి సినిమా కోసం 'ఆటో జానీ' పేరును ఛాంబర్లో రిజిస్ట్ర్ చేశారని తెలుస్తుంది. గతంలో చిరంజీవి రౌడీ అల్లుడు సినిమాలోని పాత్ర అది. అందులో కామెడీ చేశాడు. దాన్నే టైటిల్గా పెట్టుకున్నాడనేది టాక్.
ముఖ్యమైన విషయం ఏమంటే.. ఈ చిత్రంలో బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ ఓ పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయనతో పూరీ సినిమా చేశాడు. ఇది వర్కవుట్ అవుతుందని అనుకుంటున్నారట. చిరంజీవి కూడా తన సినిమాలో అమితాబ్ నటించడం చాలా కిక్ ఇస్తుందని చెబుతున్నాడు. ఇదిలావుండగా, ఇటీవలే దాసరి ప్రకటించినట్లు పవన్ కళ్యాణ్ సినిమా కూడా సెట్ పైకి వెళ్లేందుకు దాసరి టీమ్ కసరత్తులు చేస్తోంది. త్వరలో ఆ వివరాలు తెలియజేయనున్నది. బహుశా రెండూ ఒకసారి సెట్ పైకి వెళ్ళితే ఎలా వుంటుందో చూడాలని కూడా అభిమానులు ఎదురుచూస్తున్నారట.