గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chj
Last Updated : బుధవారం, 20 జులై 2016 (19:10 IST)

'కత్తిలాంటోడు'కు బుర్రా సాయిమాధవ్ మాటల చాన్స్

చిరంజీవి 150వ చిత్రం కత్తిలాంటోడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో సెట్స్ మీది ఉన్న సంగతి విదితమే. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి తెర వెనుక పనిచేసే వారి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుం

చిరంజీవి 150వ చిత్రం కత్తిలాంటోడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో సెట్స్ మీది ఉన్న సంగతి విదితమే. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి తెర వెనుక పనిచేసే వారి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. “రావడం కొంచెం లేటు అవ్వొచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా” అని గోపాల గోపాల చిత్రంలో పవన్ కళ్యాణ్ రాజకీయ మనోభావాన్ని డైలాగ్స్ ద్వారా చెప్పించిన మాటల రచయిత, తెనాలి కుర్రోడు బుర్రా సాయి మాధవ్‌కు ఈ చిత్రానికి మాటలు రాసే మహా అవకాశం దక్కింది.
 
వినాయక్ సినిమా అంటే సాధారణంగా ఆకుల శివ రచయితగా వ్యవహరిస్తాడు. కామెడీతో పాటు హీరోయిజాన్ని చూపించే మాస్ సన్నివేశాలకు మాటలు రాయటంలో ఆకుల శివ స్పెషలిస్ట్. కానీ ఆయనిప్పుడు పవన్ ‘కడప కింగ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాకు మాటల రచయిత సుపరిచితుడైన సాయి మాధవ్ బుర్రా.. గోపాల గోపాల సినిమాతో మెగా కాంపౌడ్ లోకి అడుగుపెట్టారు. 
 
ఆయన మాటల్లో సామాజిక అంశాలతో పాటు, సందేశాలు కూడా వినిపిస్తుండటంతో చిరు పిలిచి మరి అవకాశం ఇచ్చారట. అలా సాయి మాధవ్ రాసిన మాటలు, చిరంజీవి 150 సినిమాలోని కీలక సన్నివేశాల్లో వినిపించనున్నాయన్న టాక్ వినిపిస్తోంది.