సారీ అన్నా అంటూ చిరంజీవికి షాకిచ్చిన సునీల్... ముందుకొచ్చిన వెన్నెల కిషోర్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కమెడియన్ కమ్ హీరో సునీల్ పెద్ద షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం చిరంజీవి 150వ చిత్రం 'కత్తిలాంటోడు' సెట్స్పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మిస్తున్నారు. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక దాదాపుగా పూర్తయిందట.
ఈ సినిమాలో చిరంజీవికి ఫ్రెండ్ పాత్ర ఒకటి ఉందట. ఈ పాత్రకి సునీల్ అయితేనే కరెక్ట్ ఉంటుందని యూనిట్ సభ్యులు భావించారట. ఇందుకోసం సునీల్ని సంప్రదిస్తే ఒప్పేసుకున్నాడని అప్పట్లో వార్తలొచ్చాయి. గతంలో చిరు, సునీల్ కలిసి 'ఠాగూర్', 'జై చిరంజీవ' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు చిరు సినిమాకి సునీల్ నో చెప్పాడట. డేట్స్ కుదరక పోవడమే దీనికి కారణమని టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం.
అప్పట్లో సునీల్ దగ్గర కొన్ని డేట్స్ ఉండటం వల్ల ఒప్పేసుకున్నాడట. అయితే సినిమా కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ అవుతూ అవుతూ ఇప్పటికి ఫైనల్ అయ్యింది. తీరా మొదలయ్యే సరికి సునీల్ మూడు సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల చిరు సినిమాకి సరిపడే డేట్స్ లేవట. దీంతో చిరు సినిమాకి సారీ చెప్పి తన సినిమాలు చేసుకుంటున్నాడట ఈ 'అందాలరాముడు'.
హీరో అయ్యాక సునీల్ కామెడీ రోల్స్ దాదాపు మానేశాడు. కాని తను ఆరాధించే హీరో కోసం తన హీరో స్థానాన్ని పక్కన పెట్టి మళ్ళీ కమెడియన్గా కనిపించటానికి ఒప్పుకున్నాడు. చిరు సినిమా కోసం 40 రోజులు డేట్స్ కేటాయించవలసి ఉందట. ఈ బిజీ షెడ్యూల్ కారణంగా 40 రోజులు చిరు సినిమా కోసం డేట్స్ కేటాయించడం కుదరకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీంతో వెన్నెల కిషోర్ను సునీల్ స్థానంలోకి తీసుకోవాలని వినాయక్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.