బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : సోమవారం, 10 అక్టోబరు 2016 (15:19 IST)

'ఒసేయ్...రాములమ్మ'గా మంచు లక్ష్మి...దాసరి దర్శకత్వంలో

ప్రస్తుతం ఎక్కడ చూసినా... ఇప్పుడంతా రీమేక్స్, సీక్వెల్స్ మీద పడుతున్నారు. వాటికి ప్రేక్షకాదరణ లభిస్తుండడంతో దర్శకనిర్మాతలు ఆ దిశగా తమ సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ బాటలోకి ప్రముఖ దర్శకుడు దాసరి

ప్రస్తుతం ఎక్కడ చూసినా... ఇప్పుడంతా రీమేక్స్, సీక్వెల్స్ మీద పడుతున్నారు. వాటికి ప్రేక్షకాదరణ లభిస్తుండడంతో దర్శకనిర్మాతలు ఆ దిశగా తమ సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ బాటలోకి ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కూడా వస్తున్నట్టు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
గతంలో ఆయన విజయశాంతిని ప్రధాన పాత్రలో పెట్టి రూపొందించిన 'ఒసేయ్...రాములమ్మ' చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తీసే యోచన చేస్తున్నారట. అప్పట్లో 'ఒసేయ్...రాములమ్మా' సినిమా సంచలన విజయం సాధించి, విజయశాంతి ఇమేజ్‌ను ఎన్నో రెట్లు పెంచింది. ఈ కథకు కొనసాగింపుగా 'రామసక్కని తల్లి' పేరుతో దాసరి అద్భుతమైన కథను తయారుచేసుకున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
ఇటీవల మంచు లక్ష్మి నటించిన ''లక్ష్మీ బాంబ్ '' చిత్ర ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన దాసరి నారాయణరావు లక్ష్మిలో ఈ యాంగిల్ కూడా ఉందని నాకు తెలియదు... లక్ష్మీ బాంబ్ ట్రైలర్ చూసాక ''ఒసేయ్ రాములమ్మ'' సీక్వెల్ లక్ష్మి మంచుతో చేయాలనీ ఉందని అన్నాడు. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఒసేయ్ రాములమ్మా తెలుగు చలన చిత్ర చరిత్రలోనే సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మరి ఈ సీక్వెల్ లో నటించడానికి లక్ష్మి ఒప్పకుంటుందో లేదో వేచి చూడాలి.