దీక్షాసేథ్ కాలికి గాయమైందట...
నటి దీక్షాసేథ్ కాలికి ఫ్రాక్చరైందట. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేసింది. వేదంతో పాటు ప్రభాస్తో కలిసి నటించిన ఈమెకు ఎత్తు తగ్గ అందం వున్నా.. నటనలో ఇంకాస్త మెరుగుపర్చుకోవాలని అంటుండేవారు. ఎందుకోకానీ అవకాశాలు సన్నగిల్లాయి. కొన్నాళ్ళు కన్పించకుండా పోయింది. హిందీలో కొన్ని సినిమాలు చేస్తుంది.
అయితే ఇటీవలే ఆమె ట్విట్టర్లో ... తన కాలు ఫ్రాక్చర్ అయిందనీ, డాక్టర్లు మూడు నెలలు రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చారంటూ పేర్కొంది. అయితే అందుకు కారణం ఏమీ వెల్లడించేదు. ఇటీవల ఆమెపై వస్తున్న గాసిప్కు ఫుల్స్టాప్ పెట్టడానికి ఇలా చేసిందని తెలుస్తోంది. త్వరలో ఆమె ఓ తమిళ చిత్రంలో నటించనుంది.