రామ్ చరణ్తోనే 'జగదేక వీరుడు అతిలోక సుందరి' రీమేక్!
సుప్రీం హీరో చిరంజీవి, అందాల నటి శ్రీదేవి జంటగా నటించి సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రానికి దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించగా, వైజయంతీ మూవీస్ పతాకంపై సి అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రం ఆ రోజుల్లో నిర్మాతకు కనకవర్షం కురిపించింది.
అయితే, ఈ చిత్రాన్ని ప్రస్తుతం రీమేక్ చేసే అంశంపై ఫిల్మ్ నగర్లో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఇదే అంశంపై ఆ చిత్ర దర్శకుడు కె రాఘవేంద్ర రావు ఒక ప్రైవేట్ టీవీ చానెల్లో వచ్చే తన కార్యక్రమంలో స్పందిస్తూ.. జగదేక వీరుడు.. అతిలోక సుందరి చిత్రం రీమేక్ చేయాల్సి వస్తే చిరంజీవిగారి అబ్బాయిగా చరణ్తోనే తీయాల్సి ఉంటుందన్నారు.
అయితే, హీరోయిన్గా శ్రీదేవి కుమార్తె జాహ్నవి మాత్రం ఉండదని, కానీ, చరణ్కు తగిన జోడీగా ఉండే అమ్మాయిని ఎంపిక చేయాల్సి ఉంటుందని చెప్పారు. అపుడే నిర్మాతకు రిస్క్ తక్కువగా ఉంటుందని రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు. సో.. త్వరలోనే ఈ చిత్రం రీమేక్పై త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నమాట.