మహేష్ బాబుకు రూ. 18 కోట్ల డీల్తో సిమెంట్ వ్యాపారి కమ్ ప్రొడ్యూసర్
మహేష్ బాబుతో సినిమాలు తీయాలని చాలామంది ట్రై చేస్తున్నారు. అయితే ఆయన డేట్స్ దొరకడం అంటే ఎన్ని సంవత్సరాలు ఆగాలో తెలియదు మరి. కానీ గతంలో గోపీచంద్తో పలు చిత్రాలు తీసిన భవ్య క్రియేషన్స్ ప్రసాద్కు ఈ పని ఈజీగా అయిపోయిందట. తాజాగా ఆయన తన బేనర్లో మహేష్తో సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఇందుకుగాను మహేష్ బాబుకు రెమ్యునరేషన్గా రూ. 18 కోట్లు ఇవ్వనున్నట్లు డీల్ కుదిరినట్లు ఫిలింనగర్లో కథనాలు విన్పిస్తున్నాయి. ఆమధ్య 'లౌక్యం' సినిమా తీశాక... గోపీచంద్తో మరో సినిమా గ్యాప్ ఇస్తున్నట్లు చెప్పిన నిర్మాత.. ప్రముఖ హీరోతో చేయనున్నట్లు ప్రకటించారు. అయితే రామ్ చరణ్తో కూడా ప్రయత్నాలు మొదలుపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ జరగాలంటే.. ఎంత టైమ్ పట్టినా ఓకే అనేట్లున్నాడట నిర్మాత అయిన ఈ సిమెంట్ వ్యాపారి.