గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : గురువారం, 26 మే 2016 (10:11 IST)

జూ.ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రంలో సచిన్ ఖేద్కర్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ''జనతా గ్యారేజ్''. ఈ చిత్రంలో ఎన్టీ ఆర్ సరసన సమంత, నిత్యామీనన్  హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో మళయాళ నటుడు మోహన్ లాల్, ముకుందన్, రఘుమాన్, సాయికుమార్, సుహాసిని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటోంది. 
 
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60 శాతం దాకా పూర్తి చేసుకుంది. ఇంకో నెల రోజుల్లో టాకీ పార్ట్ అంతా పూర్తయ్యే అవకాశముందని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇంకో ఆసక్తికర విషయమేంటంటే ఈ చిత్రంలో ఇంకో ప్రముఖ నటుడు చేరబోతున్నాడు. ఆయనే సచిన్ ఖేద్కర్. ''బ్రదర్స్'' చిత్రాల్లో నటించిన మరాఠీ నటుడు సచిన్ ఖేద్కర్.."జనతా గ్యారేజ్''‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 
 
ఈ చిత్రంలో ఆయన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడని సినీవర్గాలు అంటున్నాయి. సచిన్‌‌కి కథ, ఆయన పాత్ర గురించి చెప్పగానే ఈ చిత్రంలో నటించడానికి సమ్మతించాడట. ''నాన్నకు ప్రేమతో'' చిత్రం హిట్ తర్వాత ఎన్టీఆర్.. ''శ్రీమంతుడు'' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ''జనతా గ్యారేజ్'' మీద అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్టు 12 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.