శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Modified: మంగళవారం, 6 అక్టోబరు 2015 (20:51 IST)

నయనతార క్రేజ్‌ పెరిగింది... డీఎంకే లాక్కోవాలని చూస్తోందట....

చంద్రముఖిలో రజనీకాంత్‌తో పనిమనిషిగా నటించిన నయనతార ఒక్కసారిగా క్రేజ్‌ పెరిగి.. ఆఫర్లు వచ్చేశాయి. దాంతో మూడు భాషల్లో తెగ నటించేసింది. అది అలావుంటే.. ఇటీవలే ఆమె ఇంటిపై ఐటీ దాడులు జరగడంతో మరింత క్రేజ్‌ ఏర్పడింది. ఇది మమూలైనా... నెగెటివ్‌ ప్రచారం జనాల్లోకి తెగ వెళ్ళిపోయింది. అందులోనూ తమిళలులు బ్రహ్మరథం పట్టేస్తారు. ఖుబ్బూ లాంటి వారికే దేవాలయాలు కట్టించేశారు. ప్రస్తుతం అంతకంటే ఎక్కువే జరిగింది.
 
టీవలే ఓ కార్యక్రమం కోసం సేలం వెళ్ళిన ఆమెను చూడ్డానికి అభిమానులు పోటెత్తారు. ప్రధాన రోడ్లన్నీ బ్లాక్‌ అయ్యాయి. దాంతో.. రాజకీయ నాయకులు ఆలోచనలు మారిపోయాయి. ఆమెను తమ ప్రచార అస్త్రంగా వినియోగించుకొనేందుకు ప్లాన్‌ వేస్తున్నారట. డిఎం.కె. ముందు స్టెప్‌ వేసి.. ఆమెను తన వైపులాగేందుకు ప్రయత్నాలు చేస్తుంది. మరి జాతీయ పార్టీ బిజెపి కూడా అందుకు సిద్ధంగా వుందని ఛానల్స్‌లో ప్రసారాలు జరుగుతున్నాయి. ఏదిఏమైనా.. ఒక్క  ఐటీ దాడి ఆమెను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది.