శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2016 (14:24 IST)

నిర్మాతగా మారనున్న నయనతార.. విఘ్నేష్ శివన్ దర్శకత్వం...

దక్షిణాదిలో ఉన్న అగ్ర హీరోయిన్లలో నయనతార ఒకరు. అటు తమిళంలో, ఇటు తెలుగు చిత్రపరిశ్రమలో తన అందచందాలతో, అభినయంతో అందరిని అలరిస్తూ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. తెలుగు, తమిళ భాషలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి అటు సీనియర్‌ హీరోలతోనూ, ఇటు యంగ్‌ స్టార్స్‌తో కలిసి నటిస్తోంది. 
 
ప్రస్తుతం ఈమె.. కార్తీ సరసన ''కాష్మోరా'', విక్రమ్‌తో ''ఇరుముగన్'' సినిమాలతో పాటు తెలుగులో వెంకటేష్ సరసన ''బాబు బంగారం'' సినిమాలో నటిస్తోంది. ఇవికాకుండా త్వరలో మోహన్‌రాజా దర్శకత్వంలో శివకార్తికేయన్‌తో జోడీ కట్టనుంది. నయనతార అయితే ఇంత బిజీ హీరోయిన్‌గా కొనసాగుతున్న నయనతార ఇప్పుడు సినిమా నిర్మాణరంగం మొగ్గూచూపుతోందని వార్తలు వెలువడుతున్నాయి. 
 
ఇప్పటికే అమలాపాల్, విజయలక్ష్మి వంటి నటీమణులు నిర్మాతలుగా మారారు. సమంత కూడా నిర్మాతగా ఒక మలయాళ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకోనుంది. ఈమె ప్రియుడు దర్శకుడు విఘ్నేష్ శివ‌న్ చెప్పిన ఒక కథ విన్న తర్వాత ఆ సినిమాలో నటించడంతో పాటు తనే నిర్మిస్తానని చెప్పిందట. మేలో షూటింగ్ స్టార్ట్ కాబోతున్న ఈ సినిమా గురించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి. సో నయన్ హీరోయిన్‌గానే కాదు నిర్మాతగా కూడా బిజీ కానుందనమాట.