అనుకోకుండా ఎదురైన మాజీ ప్రేమ పక్షులు.. నయనతార-ప్రభుదేవా చాలాసేపు ఏం మాట్లాడుకున్నారు?
దక్షిణాది హీరోయిన్ నయనతార లవ్ స్టోరీ మాత్రం ఎవ్వరికీ అర్థం కాదు. తొలుత శింబు, ఆపై ప్రభుదేవా, ప్రస్తుతం విఘ్నేష్ అంటూ మారుతూనే ఉంది. విఘ్నేష్తోనే నయనతార లవ్వాయణం ముగుస్తుందని.. త్వరలో ఆతనితో నయన పెళ్ల
దక్షిణాది హీరోయిన్ నయనతార లవ్ స్టోరీ మాత్రం ఎవ్వరికీ అర్థం కాదు. తొలుత శింబు, ఆపై ప్రభుదేవా, ప్రస్తుతం విఘ్నేష్ అంటూ మారుతూనే ఉంది. విఘ్నేష్తోనే నయనతార లవ్వాయణం ముగుస్తుందని.. త్వరలో ఆతనితో నయన పెళ్లి జరుగుతుందని వార్తలొచ్చాయి. ముఖ్యంగా ప్రభుదేవాతో నయన ప్రేమాయణం కోలీవుడ్తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను షేక్ చేసింది.
ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన విల్లు చిత్రంలో నయనతార నాయకిగా నటించారు. ఈ సినిమా వీరిద్దరి మధ్య ప్రేమను చిగుర్చింది. నయనతారను పెళ్లి చేసుకునేందుకు ప్రభుదేవా తన మొదటి భార్య రమలతతో విడాకులు తీసుకున్నారు. అదేవిధంగా నయనతార కూడా ప్రభుదేవా కోసం క్రిస్టియన్ నుంచి హిందూ మతానికి మారారు. ఇక పెళ్లి జరుగబోయే సమయానికి వీరిద్దరి మధ్య మనస్పర్థాలు ఏర్పడ్డాయి. దీంతో వారు విడిపోయారు.
అనంతరం ప్రభుదేవా బాలీవుడ్లో దర్శకుడిగా పేరు కొట్టేశాడు. ఇక నయనతార ఫుల్ ఆఫర్లతో అగ్రతారగా వెలిగిపోతోంది. ఇలా ఎవరి పనిలో వారు మునిగిపోయారు. ఇలాంటి తరుణంలో మాజీ ప్రేమికులు కలుసుకోవడం అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం నానూమ్ రౌడాదాన్ చిత్రంలో నటించిన నయనతార ఆ సినిమా దర్శకుడు విఘ్నేశ్ శివతో నయన ఎఫైర్ సాగినట్లు, వారిద్దరు కలిసి సహజీవనం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే ప్రభుదేవా, నయనతార అనుకోకుండా ఒక నక్షత్ర హోటల్లో ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా చాలా సేవు వీరిద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి గురించే కోలీవుడ్ జనం తెగ చర్చించుకుంటున్నారు. మరి నయనతార ప్రేమ-పెళ్లి ఏ దారిన వెళ్తుందో వేచి చూడాలి.