ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాక ఇష్టం లేకున్నా 'ఆ' పనులు చేయాల్సిందే : ప్రణీత!
చిత్ర పరిశ్రమకు వచ్చిన తర్వాత నిజ జీవితంలో ఇష్టంలేని పనులు కూడా కిమ్మనకుండా చేయాల్సిందేనని అత్తారింటికి దారేది చిత్రంలో టాలీవుడ్ తెరకు పరిచయమే బాపు బొమ్మ ప్రణీత అంటోంది. ఈ ముద్దుగుమ్మ ఏం పిల్లో.. ఏం పిల్లడో చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పవన్తో జతకట్టి మంచి పేరు తెచ్చుకోగా, ఇపుడు జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం రభసలో నటిస్తోంది.
ఈ సందర్భంగా తన చిత్ర ప్రయాణంపై ప్రణీత స్పందిస్తూ... సినిమా జీవితం వేరు.. వ్యక్తిగత జీవితం వేరు. అవి రెండూ ఎన్నడూ ఒక్కటి కావు. సినిమా స్టార్గా పేరు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడాలి. స్టార్ ఇమేజ్ వచ్చాక దాన్ని నిలుపుకునేందుకు మరింతగా శ్రమించాల్సి ఉంటుందని చెపుతోంది.
ముఖ్యంగా.. చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత నిజ జీవితంలో మనకు ఇష్టం లేని పనులు కూడా ఇక్కడ చేయాల్సి ఉంటుంది. కాదూకూడదు అంటే ఇక తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనని తన మనస్సులోని మాటను వెల్లడించింది.