చిరు మీద పూరీ పంచ్లు... జీవితంలో రిస్క్ తీసుకోవాల్సిందే.. లేదంటే రీమేక్లే ఆధారం...
నందమూరి నటవారసులలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి పాపులారిటీని సంపాదించుకున్న హీరో కల్యాణ్ రామ్. దశాబ్దానికిపైగా సినిమాల్లో నటిస్తూ అడపాదపడా విజయాలు అందుకున్న కల్యాణ్రామ్.. ఇప్పటివరకు భ
నందమూరి నటవారసులలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి పాపులారిటీని సంపాదించుకున్న హీరో కల్యాణ్ రామ్. దశాబ్దానికిపైగా సినిమాల్లో నటిస్తూ అడపాదపడా విజయాలు అందుకున్న కల్యాణ్రామ్.. ఇప్పటివరకు భారీ సూపర్హిట్ను మాత్రం అందుకోలేకపోయారు. ఈసారి మాత్రం ఆయన తన తాజా చిత్రం ''ఇజం'' ద్వారా సూపర్హిట్ను అందుకుంటున్నారు. మరోపక్క దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ''జ్యోతిలక్ష్మి'', ''లోఫర్'' చిత్రాలు డిజాస్టర్గా నిలిచాయి. ఆ తర్వాత పూరి కాస్త గ్యాప్ తీసుకుని కళ్యాణ్ రామ్ హీరోగా ''ఇజం'' సినిమాను తెరకెక్కించాడు.
ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో... పలు ఛానెల్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో పూరి చేసిన కామెంట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ''ఇజం'' ప్రమోషన్స్లో భాగంగా పూరి మాట్లాడుతూ... ''జీవితంలో రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంటే ఏమైనా సాధించొచ్చు. టాప్ హీరోయిన్లుగా ఎదిగిన కాజల్, సమంతలనే హీరోయిన్గా పెట్టుకుంటే మంచిదని భావిస్తే ఎప్పుడూ ఓ కొత్తమ్మాయిని ప్రోత్సహించలేం. హీరోలు కూడా అంతే. కొత్త కథ చేద్దాం అనే భావన వారిలో ఉంటే కొత్త కథలు, కథనాలు వస్తాయి. లేదూ అదే మూస ధోరణిలో వెళ్దాం.
రీమేక్లనే నమ్ముకుందాం అంటే వాళ్లు కొత్త కథలను సినిమాలుగా తీయలేరు. చాలా మంది హీరోలు కొత్త కథలను అంగీకరించే ధైర్యం లేక రీమేక్లపై ఆధారపడుతున్నారు'' అని పూరి అన్నాడు.
అయితే పూరి మాటలను గమనిస్తే... ఈ పంచ్లు మెగాస్టార్ చిరుకే తగిలినట్టు కనిపిస్తోంది. చిరు తన 150వ సినిమాను ముందుగా పూరితో అనుకుని ఆ తర్వాత కోలీవుడ్ హిట్ మూవీ కత్తికి కమిట్ అయ్యాడు. ఇక చిరు సినిమాలో కాజల్ హీరోయిన్.. ఈ డైలాగ్స్ చిరును టార్గెట్ చేసుకునే పూరి పేల్చి ఉంటాడన్న టాక్ టాలీవుడ్లో కాస్త గట్టిగానే వినిపిస్తుంది.