రజినీకాంత్ మరోసారి 'బాషా'గా వచ్చేందుకు రెడీ...?
సూపర్స్టార్ రజనీకాంత్కు కథ నచ్చితేనే చేస్తాడని అభిమానులు చెబుతున్నారు. ఇటీవలే చెన్నైలో 'బాషా' సీక్వెల్ చేస్తున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. ఒక్కసారి చెబితే.. వందసార్లు చెప్పినట్లే.. అనే డైలాగ్ ఇప్పటికీ పాపులర్. అందుకే దాన్ని రెండొందల సార్లు చెప్పాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రెండో భాగంగా ఓ కథను రజనీకి చెప్పినట్లు సమాచారం. నిజానికి ఆ చిత్రానికి సీక్వెల్ చేయడానికి రజనీకి ఇష్టంలేదట. కానీ పేరు బాషా సీక్వెల్ అని చెప్పినా.. కథ వేరేగా వుండటంతో కొత్తగా అనిపించడంతో రజనీ అంగీకరించాడని తెలుస్తోంది.
మరి అదే గనుక జరిగితే ఈ బాషా ఎన్ని రికార్డులు చేస్తుందో చూడాలి. కాగా, లింగా సినిమా తర్వాత తదుపరి చిత్రంపై రజనీ స్టేట్మెంట్ ఇవ్వనున్నట్లు ఆయన అభిమాన సంఘాలు తెలుపుతున్నాయి.