రామ్ చరణ్ కాకపోతే మరో హీరో అంటున్న దర్శకుడు
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ముందువరకు హిట్స్ వచ్చినా... లేటెస్ట్గా ప్లాప్ వస్తే అవన్నీ కొట్టుకుపోతాయి. కొన్ని వివాదాల మధ్య పూర్తయిన 'గోవిందుడు..' సినిమా తర్వాత హీరో రామ్ చరణ్తో... 'ఆగడు' దర్శకుడు శ్రీను వైట్ల ఓ కథ చెప్పాడు. అయితే ఆ కథ నచ్చలేదని అందుకే ఇంకా ఏమీ అనుకోలేదని చరణ్ తెలియజేశాడు.
తాజాగా చరణ్కు చెప్పిన స్క్రిప్ట్ను నాగార్జునకు చెప్పినట్లు తెలిసింది. నాగార్జున ఆ కథను చైతన్యను దృష్టిలో పెట్టుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిలింనగర్లో వార్తలు విన్పిస్తున్నాయి. చిత్రమేమంటే... ఈ చిత్రానికి నిర్మాతగా ముందు నాగ్ చేయాలనుకున్నా... ఆ చిత్రాన్ని తాను చేస్తానని మురళీమోహన్ తెరపైకి వచ్చినట్లు సమాచారం.
చాలాకాలం తర్వాత జయభేరి సంస్థలో ఆయన సినిమాలు తీయడంలేదు. అప్పట్లో మహేష్ బాబుతో 'అతడు' తీశాడు. మరి ఇది త్వరలో నిజమయ్యే సూచనలు వున్నాయని ఆశిద్దాం.