శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 19 మే 2017 (14:58 IST)

"బాహుబలి 2"ను తెగ చూస్తున్నారు.. ఆందోళన చేయండి : కన్నడవాసులకు రాంగోపాల్ వర్మ పిలుపు

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు మరోమారు ట్వీట్ చేశారు. ఈ దఫా కర్నాటక రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చేశారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి 2' చిత్రం గత నెల 28వ తేదీన విడుదలైన విషయం తెల్సిం

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు మరోమారు ట్వీట్ చేశారు. ఈ దఫా కర్నాటక రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చేశారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి 2' చిత్రం గత నెల 28వ తేదీన విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే, ఈ చిత్రం విడుదలకు ముందు కొన్ని కన్నడ సంస్థలు.. 'బాహుబలి 2' చిత్రం విడుదల కాకుండా అడ్డుకుంటామని ప్రకటించారు. ఆ తర్వాత ఈ సమస్య సద్దుమణిపోయిన తర్వాత 'బాహుబలి 2' చిత్రం విడుదలైంది. 
 
ఒకవైపు.. ‘బాహుబలి-2’ చిత్రాన్ని ఆకాశానికెత్తేస్తూ ట్వీట్ల‌పై ట్వీట్లు చేస్తున్న ఈయన.. ఇపుడు ఈ సినిమా విడుద‌ల‌ను అడ్డుకుంటామ‌ని ముందుగా ప్ర‌క‌టించిన క‌న్న‌డిగుల‌పై తాజాగా మండిప‌డ్డాడు. తెలుగు సినిమా 'బాహుబలి-2' క‌ర్నాట‌క‌లో అక్క‌డి సినిమాల కంటే పెద్ద విజ‌యాన్ని సాధించింద‌ని, కన్నడిగులు చేసే డబ్బింగ్‌ సినిమాల రికార్డులను ఓ తెలుగు సినిమా చెరిపేసిందని వ్యాఖ్యానించారు. 
 
దీంతో క‌న్న‌డ ప్ర‌జ‌ల‌కు కావాల్సింది ఓ మంచి సినిమా మాత్రమేనని అర్థమవుతోందన్నారు. తమ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు తమ భాషలో వచ్చిన సినిమా కంటే తెలుగులో వచ్చిన బాహుబలినే ఎక్కువ సార్లు చూస్తున్నందుకు కర్ణాటక వాసులంతా ఆందోళన చేపట్టాలంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.