మా ఇద్దరికీ పెళ్లయింది... ముద్దు సీన్ తీసేస్తారా... 'సావిత్రి' ముద్దు సీన్లపై అభ్యంతరం!
టాలీవుడ్ హీరో జేడీ చక్రవర్తి, 'సావిత్రి' చిత్ర హీరోయిన్ అనుకృతిలు ఓ ఇంటివారయ్యారు. అయితే, వీరిద్దరు ఒక్కటికాకముందు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో సావిత్రి చిత్రాన్ని తీశారు. ఇందులో జేడీ చక్రవర్తి, అనుకృతి
టాలీవుడ్ హీరో జేడీ చక్రవర్తి, 'సావిత్రి' చిత్ర హీరోయిన్ అనుకృతిలు ఓ ఇంటివారయ్యారు. అయితే, వీరిద్దరు ఒక్కటికాకముందు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో సావిత్రి చిత్రాన్ని తీశారు. ఇందులో జేడీ చక్రవర్తి, అనుకృతిల మధ్య ఘాటైన ముద్దుసీను సన్నివేశాన్ని దర్శకుడు చిత్రీకరించారు. ఇపుడు ఈ ముద్దుసీను చిత్రంలో ఉంటుందా లేదా సందేహం చిత్ర యూనిట్ వర్గాల్లో నెలకొంది.
సాధారణ కిస్సింగ్ సీన్లకు భిన్నంగా కాస్తంత సుదీర్ఘంగా, ఘాటుగా ఈ ముద్దు సీన్ ఉంటుందట. అయితే ఇప్పుడా సీన్ సినిమాలో ఉంటుందో, ఉండదో అనే అనుమానం వ్యక్తం చేస్తోందట చిత్ర యూనిట్. ఇప్పుడు జేడీ, అనుకృతి భార్యాభర్తలు అయిపోయారు కాబట్టి ఆ సీన్ ఉంటే బాగోదని కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, మరికొంతమంది మాత్రం ఆ సీన్ ఉంటే ‘సావిత్రి’కి మరింత క్రేజ్ వస్తుందని అంటున్నారట. మరి ఈ విషయంలో రాంగోపాల్ వర్మ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.