మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (15:57 IST)

భారత్ వర్సెస్ పాకిస్తాన్... మొదటి సబ్‌మెరైన్ యుద్ధకథా చిత్రం... హీరోగా 'బాహుబలి' రానా

బాహుబలి చిత్రంతో మంచి ఇమేజ్ సాధించేసిన దగ్గుబాటి రానా మరో భారీ చిత్రానికి అంగీకరించినట్లు టాలీవుడ్ న్యూస్. 1971లో భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ మోహరించిన సబ్ మెరైన్ పీఎన్ఎస్ ఘజి సముద్రంలో మునిగిపోయింది. ఐతే ఇది ఎలా మునిగిపోయిందన్నది ఇప్పటికీ మిస్టరీయే. 
 
కాగా ఆ సమయంలో ఇండియా నుంచి యుద్ధానికి వెళ్లిన ఎస్21 సబ్ మెరైన్ నేవల్ ఆఫీసర్, తన బృందంతో 18 రోజుల పాటు సముద్ర గర్భంలోనే యుద్ధం చేశారు. ఈ సంఘటన ఇతివృత్తంగా తీసుకుని చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నేవీ ఆఫీసర్‌గా బాహుబలిలో ప్రతినాయకుడిగా కనిపించి ప్రశంసలు అందుకున్న దగ్గుబాటి రానా కనిపించబోతున్నట్లు సమాచారం. 
 
ఈ చిత్రానికి సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. చిత్ర కథను రానాకు చెప్పగానే ఓకే చెప్పినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రాన్ని పీవిపి సినిమా భారీ బడ్జెట్టుతో తీయబోతున్నట్లు తెలుస్తోంది.