'బాహుబలి' చూశాక.. శంకర్ 'రోబో 2'కు మార్పులు.. అవేంటి...?
అప్పటివరకు శంకర్ 'రోబో' చిత్రం ఇండస్ట్రీలోనే హైటైల్. కానీ బాహుబలి వచ్చాక.. ఇండియాలోనే సినిమా చరిత్ర మారిపోయింది. మొదటి నుంచి రోబో సీక్వెల్ తీయడానికి సిద్ధమైన శంకర్ ఈసారి చాలా కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. 2010లో విడుదలైన ఈ గ్రాఫికల్ వండర్కు ప్రస్తుతం సీక్వెల్ రూపొందించే విషయమై దర్శకుడు శంకర్ కసరత్తులు చేస్తోన్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమాను నిర్మించేందుకు లండన్కు చెందిన ఓ ప్రముఖ నిర్మాత ముందుకొచ్చారని తెలుస్తోంది. సుమారు 240 కోట్ల బడ్జెట్ అంచనాతో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఇచ్చేందుకు ఇప్పటికే పలు పెద్ద నిర్మాణ సంస్థలు సైతం ముందుకు వచ్చాయి. ఇక ఇప్పుడు ఏకంగా ఫారిన్ ప్రొడ్యూసర్స్ కూడా రావడం ఆసక్తికరంగా కనిపిస్తోంది.
3డీలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందనున్న ఈ సినిమాకు ఇంటర్నేషనల్ ఫీల్ తెచ్చేందుకు దర్శకుడు శంకర్, ఈ సినిమాలో విలన్గా నటించేందుకు హాలీవుడ్ నటుడిని ఒప్పించనున్నట్లు సమాచారం. డిసెంబర్లో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో భారతీ సినిమా వరల్డ్లో మరో రేంజ్కు వెళ్ళిపోతుందన్నమాట.