పద్మ అవార్డు తర్వాత రాజమౌళి సీన్ మారింది, ముంబైలో పెద్ద భవంతి ఎదురుచూస్తోందట...
బాహుబలి చిత్రం ఏళ్ళ తరబడి తీసినా ఆ చిత్రం విడుదల తర్వాత వచ్చిన క్రేజ్ అంతాఇంతా కాదు. ఏకంగా పద్మ అవార్డునే తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు సీక్వెల్ ప్రస్తుతం జరుగుతోంది. కాగా, బాలీవుడ్లోనూ ఆఫర్లు వస్తున్నా వెళ్ళకుండా.. తెలుగుపైనే శ్రద్ధ పెడుతున్నట్లు ట్వీట్లు చేసేశాడు. కానీ కరన్ జోహార్తో వున్న సంబంధాలతో బాహుబలి-2 తర్వాత హిందీ చిత్రం చేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.
ఇందుకు ప్రధానంగా రాజమౌళి కార్యాలయం కోసం ఆయన ముంబైలో ఓ భారీ కార్యాలయాన్ని తెరవనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. బాంద్రాలో 14వ అంతస్తులోని ఓ భవంతిలో ఆయన కార్యలయం వుండబోతున్నదని చెబుతున్నారు. వచ్చే ఏడాదికి బాహుబలి-2 విడుదలవుతంది.
అయితే.. బాహుబలి 3 కూడా వుండొచ్చు. అలా 4 కూడా తీయవచ్చు.. అంటూ చందమామ కథలుగా ఆయన బాహుబలి చిత్రాన్ని అభివర్ణించారు. సో.. ఏది ఏమైనా.. బాలీవుడ్కు ఆయన వెళ్ళడం ఖాయమనే వార్తలకు ఆధారాలు కన్పిస్తున్నాయి.