వెండితెరపై మరోమారు కనిపించనున్న బాలీవుడ్ మాజీ ప్రేమికుల జంట!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ఖాన్తో మరోసారి కత్రినా కైఫ్ జతకట్టనుందనే వార్త ఇపుడు బాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. నాలుగు సంవత్సరాల క్రితం ''ఏక్ థా టైగర్''లో కలిసి నటించిన మాజీ ప్రేమ పక్షులు... మరోసారి జంటగా తెరపై కనిపించే అవకాశాలున్నాయి. 'బజరంగీ భాయ్ జాన్' దర్శకుడుతో కబీర్ ఖాన్, కండలవీరుడు సల్మాన్ కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కనుంది.
కుటుంబ కథా నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాగా సల్మాన్ ఖాన్ ''సుల్తాన్'' సినిమా షూటింగ్ పూర్తికావడంతో త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఇందులో హీరోయిన్లుగా దీపికా పదుకోనే, కత్రినా కైఫ్లు నటిస్తున్నారు. రాజ్ కుమార్ సంతోషి, సూరజ్ భాటియాతో సినిమాలు చేయడానికి సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.