సంపత్నందికి బ్రేక్ పడింది... 'గాలిపటం'లో పవన్ కళ్యాణ్ పై విమర్శ...
'రచ్చ' దర్శకుడు సంపత్నంది, 'గాలిపటం' నిర్మాతకి పవన్ కళ్యాణ్తో 'గబ్బర్సింగ్-2' సినిమా తీసే ఛాన్స్ వచ్చిందని ప్రకటన కూడా ఇచ్చారు. ఆ చిత్రానికి కాస్త గ్యాప్ రావడంతో.. ఏదో సినిమా చేయాలని తన స్నేహితుడు నవీన్గాంధీని దర్శకుడిగా పెట్టి గాలిపటం తీశాడు. అయితే ఈ చిత్రంలో హీరో ఆది పవన్ అభిమాని.. పెద్దలు కుదిర్చిన అమ్మాయిని చేసుకుని.. తప్పు చేశాననీ, గతంలో ప్రేమించిన అమ్మాయివైపే వెళ్ళిపోతాడు.
సహజీవనం చేయాలనే కాన్సెప్ట్ ఆ అమ్మాయిది. సరిగ్గా ఈ సన్నివేశంలో హీరో ఆది.. గబ్బర్సింగ్లో ఓ పాటను పాడుతూ స్టెప్లేస్తాడు. రెండుమూడు చోట్ల ఇలాగే జరుగుతుంది. ఈ సీన్ గురించి ఆది మాట్లాడుతూ... పవన్ను దృష్టిలో పెట్టుకుని తీయలేదు. సినిమాపరంగా చూడండి. వ్యక్తిగతంగా వద్దని బదులిచ్చాడు. కానీ అదే సంపత్నందికి పెద్ద బ్రేక్ అయినట్లు తెలుస్తోంది.
ఆ ఎఫెక్ట్ గబ్బర్సింగ్-2పై బాగా పడిందనీ, సంపత్నందికి ఛాన్స్ ఇవ్వడంలేదని విశ్వసనీయ సమాచారం. తెలిసితెలిసి ఎలా గాలిపటంలో ఆ సీన్స్ పెట్టాడో ఎవరికీ అర్థంకాలేదు. ప్రస్తుతం గబ్బర్ సింగ్-2 కంటే తనకు గోపాల గోపాల.. చిత్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్లు పవన్ తెలియజేస్తున్నాడు.